దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి అవసరం.కానీ ఈ గుడిలో నీటితో కూడా దీపాన్ని వెలిగించవచ్చు.మధ్యప్రదేశ్లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో మనం ఈ అద్భుతాన్ని చూడవచ్చు.ఈ దీపం దాదాపుగా గత ఐదేళ్ల నుంచి నూనె,నెయ్యి అవసరం లేకుండానే కేవలం నీటితో వెలుగుతోంది.దీంతో ఈ వింతను చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.ఐదేళ్ల నుంచి ఈ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని,దేశంలో చాలా మందిరాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా ఇది మాత్రం చాలా భిన్నమైనదని అక్కడి ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రమిదలో నిత్యం నూనెకు బదులు కేవలం నీటిని పోస్తే చాలు అలా వెలుగుతూనే ఉంటుందన్నారు.ఈ ఆలయం యొక్క పూజారి "సిందూ సింగ్" మాట్లాడుతూ ఇదివరకు ఈ జ్యోతి నూనెతోనే వెలిగేది.అయితే ఒక రోజు అమ్మవారు కలలోకి వచ్చి ఈ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారు.ఆమె ఆదేశాల ప్రకారం నీటితో దీపాన్ని వెలిగించాం.అప్పటి నుంచి ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది అని ఆయన తెలిపారు.అయితే అది కలా నిజమా తెలియక ఆశ్చర్యపోయానని సుమారు రెండు నెలలపాటు ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నదీ తీరంలో ఉండటం వల్ల వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది.దీంతో వర్షాకాలమంతా ఆలయం మూసే ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు.వచ్చే వర్షాకాలం వరకు దీపం వెలుగుతూనే ఉంది.