పసిడి ధర మళ్ళీ తగ్గింది.దేశీయ మార్కెట్లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో 33,620 కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా దేశీయంగా జువెలర్లు,రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపింది.అలాగే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.కేజీ వెండి ధర స్వల్పంగా 10 రూపాయల తగ్గుదలతో 38,090 రూపాయలకు క్షీణించింది.పరిశ్రమ యూనిట్లు,మరియు నాణేపు తయారీదారుల నుంచి కూడా డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది.గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.11 శాతం పెరుగుదలతో 1,344.35 డాలర్లకు చేరింది.వెండి ధర ఔన్స్కు 0.05 శాతం తగ్గుదలతో 14.82 డాలర్లకు క్షీణించింది.ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,620కు,22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,450కు క్షీణించింది.
ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.26,800 వద్ద కొనసాగింది. కేజీ వెండి ధర రూ.10 తగ్గుదలతో రూ.38,090కు క్షీణిస్తే వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.81 పెరుగుదలతో రూ.37,116కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు,అమ్మకం విషయానికి వస్తే.కొనుగోలు ధర రూ.80,000 వద్ద,అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.ఇకపోతే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,890కు,22 క్యారెట్ల బంగారం ధర రూ.31,320కు తగ్గింది.కేజీ వెండి ధర రూ.39,900కు దిగొచ్చింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.ద్రవ్యోల్బణం,గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు,కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు,వడ్డీ రేట్లు,జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.