ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టింది. అమిత్ షా కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు చేరుకుని, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకు కదిలారు. ఇక అప్పుడు అమిత్ షా చేతిలో "టాప్ సీక్రెట్" పేరుతో ఉన్న పత్రాలు మీడియా కంటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తీసుకోవాల్సిన చర్యలను, రాజ్యాంగపరమైన, రాజకీయం, శాంతిభద్రతలు అనే మూడు అంశాలుగా విభజించారు.
అయితే అమిత్ షా మొదటి విభాగంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు నోట్ చేసుకున్నారు. సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, ఇక అదే టైం లో రాష్ట్రపతి కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందులో ఉడటం జరిగింది. అలాగే ప్రధాని మోదీ సభ చైర్మన్ వెంకయ్యనాయుడితో రాజ్యసభలో భద్రత విషయాన్నీ చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్ షా నిర్ణయించారు. ఆగస్టు 7న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది.
జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్లో ఉంది. మరోవైపు హోంశాఖ కార్యదర్శి రాజీవ్గౌబాను ను శాంతిభద్రతల విషయానికి సంబంధించి జమ్మూకశ్మీర్కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చెర్యలు కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారు.