ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్టెల్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది.ప్రత్యర్థి కంపెనీ అయిన రిలయన్స్ జియో దారిలోనే నడుస్తోంది.యూజర్లకు ఇప్పుడు ఉచితంగానే హలో ట్యూన్స్ అందిస్తోంది.ముకేశ్ అంబానీ సారథ్యంలోని జియో తన కస్టమర్లకు ఉచితంగా కాలర్ ట్యూన్ సదుపాయం కల్పిస్తోన్న విషయం మనకు తెలిసిందే.ఇప్పుడు సునీల్ భారతీ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్టెల్ కూడా తన సబ్స్క్రైబర్లకు ఫ్రీగా కాలర్ ట్యూన్ సదుపాయం అందిస్తోంది. వింక్ మ్యూజిక్ యాప్ సాయంతో కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు.ఎయిర్టెల్ ఉచిత కాలర్ ట్యూన్ సదుపాయం పొందాలంటే సబ్స్క్రైబర్లు కనీసం 129 రూపాయలు లేదా ఆపై ప్లాన్ను కలిగి ఉండాలి.ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.ఇదివరకు ఎయిర్టెల్ కస్టమర్ల నుంచి హలో ట్యూన్స్ కోసం నెలకు 36 రూపాయలు వసూలు చేసేది.